హైదరాబాద్ నగరం విభిన్న సంస్కృతుల నిలయం… ఇక్కడ జీవించేవారు అందరూ తెలంగాణ వారితో సమానమే

Spread the love

హైదరాబాద్ నగరం విభిన్న సంస్కృతుల నిలయం… ఇక్కడ జీవించేవారు అందరూ తెలంగాణ వారితో సమానమే : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద


సాక్షిత ; 130-సుభాష్ నగర్ డివిజన్ లోని ఫాక్స్ సాగర్ వద్ద గల రాధాకృష్ణ దేవాలయంలో ఒడియా అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ హైదరాబాద్ నగరం విభిన్న సంస్కృతుల నిలయమని ఇక్కడ జీవించేవారు అందరూ తెలంగాణ వారితో సమానమని ఎమ్మెల్యే కేపీ.వివేకానంద అన్నారు. అనంతరం ఒడియా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఇక్కడ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద సహాయ సహకారాలతో దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారన్నారు. ఈ రాధాకృష్ణ దేవాలయం నిర్మాణంలో సహాయ, సహకారాలు అందించిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద కి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని ఒడియా అసోసియేషన్ సభ్యులు శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page