క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్న హుజురాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

Spread the love

Huzurabad Constituency MLC Padi Kaushik Reddy participated in the Christmas celebrations.

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని ఘన్ముక్ల గ్రామంలో క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్న హుజురాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవ సోదరులకు మరియు సోదరీమణులకు నా హృదయపూర్వక హ్యాపీ క్రిస్మస్ అని శుభాకాంక్షలు తెలిపారు. మీలో ఒక్కడిగా మీలో కలిసిపోవాలని ఈ పండగకు రావడం జరిగిందని మరియు ఇక్కడ ఉన్నటువంటి వారు ఇంకా వంద సంవత్సరాలు ఇలాంటి పండుగలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

ఇక్కడ ఉన్నటువంటి చర్చికి వస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం దుస్తుల పంపిణీ చేస్తున్నారని మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని ప్రజల ఆరోగ్యాలు బాగుండాలని ప ప్రేయర్ చేస్తున్నటువంటి చర్చి పాస్టర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో ఎంపీపీ రేణుక తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ ల ఫోరం జిల్లా అధ్యక్షుడు నాగిడి సంజీవరెడ్డి, దేశిని స్వప్నకోటి, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, భాస్కర్, రమేష్, సర్పంచ్ సునీత, ఉప సర్పంచ్ కొమురయ్య, వార్డు సభ్యులు, ఘన్ముక్ల చర్చి పాస్టర్ రెడ్డి, ప్రజలు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page