ఇంటి ఇంటికి జాతీయ జెండా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి

Spread the love

ఇంటి ఇంటికి జాతీయ జెండా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి
సాక్షిత
హనుమకొండ జిల్లా………. శాయంపేట మండలంలో 75వ స్వతంత్ర వజ్రోత్సవాల పండుగ సందర్భంగా స్థానిక సర్పంచ్ కందగట్ల రవి గారి ఆధ్వర్యంలో ఇంటింటికి జాతీయ జెండా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్యఅతిథిగా శాయంపేట ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి. పాల్గొని గ్రామంలోని ప్రతి ఇంటింటికి జాతీయ జెండాను అందజేశారు.

ఎంపీపీ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ

అనేక త్యాగాల తో అనేక పోరాటాలతో స్వాతంత్రాన్ని 75 ఏళ్ల స్వయంపాలన లో అప్రతిహతంగా ముందుకు సాగుతుందని అన్నారు ఉజ్వల ఘట్టం ఆవిష్కృతమై ఆగస్టు 15 నాటికి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయని అన్నారు అందుకనే శాయంపేట మండలం లోని ప్రతి గ్రామంలో ఇంటి మీద జాతీయ జెండా ఎగురవేయాలని గ్రామంలో ఉన్న స్వాతంత్ర సమరయోధులను ఘనంగా సన్మానించి కోవాలని అన్నారు

ఈ కార్యక్రమంలో భూపాలపల్లి టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బుర్ర రమేష్ గౌడ్, స్థానిక ఎంపిడిఓ కృష్ణమూర్తి, ఎంపీఓ రంజిత్ కుమార్, ఉప సర్పంచ్ దైనంపల్లి సుమన్ , పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నందం, PACS వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు రాజేందర్ మారపెల్లి మోహన్, బత్తుల కార్తీక్ అంగన్వాడీ టీచర్లు ,గ్రామ పంచాయతీ కార్యదర్శి రత్నాకర్ ,ప్రజలు పాల్గొన్నారు……

Related Posts

You cannot copy content of this page