CMRF- చెక్కు ను బాధిత కుటుంబానికి అందచేసిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ

Spread the love

హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కి చెందిన శ్రీమతి ఇమ్రాన్ బేగం గారికి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 30,000/- ముప్పై వేల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF- చెక్కు ను బాధిత కుటుంబానికి అందచేసిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరి అయిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి అని

CMRF – వివరాలు

1.హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కి చెందిన శ్రీమతి ఇమ్రాన్ బేగం గారికి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 30,000/- ముపై వేల రూపాయలు.

మొత్తం 30,000 /- ముపై వేల రూపాయలుగా మంజూరి అయినవి అని,అదేవిధంగా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గాంధీ గారు పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. ప్రభుత్వ విప్ గాంధీ గారు ఈ సందర్బంగా తెలియచేశారు.ఈ సందర్భంగా వైద్య చికిత్స కి సహకారం అందించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారికి , గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము అని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page