పేద ప్రజలకు సైతం ఉపకరించే

Spread the love

సాక్షిత : పేద ప్రజలకు సైతం ఉపకరించే అధునాతన సదుపాయాల ఫంక్షన్ హాల్స్ ను సికింద్రాబాద్ లో నిర్మించామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. అడ్డగుట్ట లోని బోయ బస్తీ కమ్యూనిటీ హాల్ లో అడ్డగుట్ట డివిజన్ కు చెందిన ఆసరా పించన్ల లబ్దిదారులకు గుర్తింపు కార్డులను అందించే కార్యక్రమం బుధవారం జరిగింది. కార్పొరేటర్ శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, తెరాస యువ నేతలు కిశోర్ కుమార్ గౌడ్, తీగుళ్ల కిరణ్ కుమార్, రామేశ్వర్ గౌడ్, లింగాని శ్రీనివాస్, తాసిల్దార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీగుల్ల పద్మారావు గౌడ్ మాట్లాడుతూ అభివృధి, సంక్షేమం లో సికింద్రాబాద్ ను అగ్ర స్థానంలో నిలుపుతున్నామని తెలిపారు. అడ్డగుట్టకు చెందిన లబ్దిదరులందరికీ ఆసరా పించన్లు అందిస్తామని తెలిపారు.

Related Posts

You cannot copy content of this page