ప్రతి కార్యకర్తకు అండగా ఉంట యువ నాయకులు గూడెం విక్రం రెడ్డి

Spread the love

గుమ్మడిదల మండలం గుమ్మడిదల గ్రామ కమిటీ యువజన విభాగం అధ్యక్షులు చిరుమని భాస్కర్ అనారోగ్యంతో మరణించడం జరిగింది. స్థానిక b r s పార్టీ నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న పటాన్చెరువు శాసనసభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ స్పందించి తన తనయుడు యువత నాయకులు గూడెం విక్రమ్ రెడ్డి ద్వారా ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ(25000) ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

ఇట్టి కార్యక్రమంలో జడ్పిటిసి చిన్న పాపాని కుమార్ గౌడ్ స్థానిక సర్పంచ్ చిమ్ముల నరసింహారెడ్డి సీ జీ ఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి మాజీ ఆలయ కమిటీ చైర్మన్ సద్ది విజయభాస్కర్ రెడ్డి నక్క వెంకటేష్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మహుమ్మద్ హుస్సేన్ టిఆర్ఎస్వి అధ్యక్షులు కానోజి రాము ప్రవీణ్ రెడ్డి కర్ణాకర్ గౌడ్ వార్డ్ మెంబర్ రాము శ్రీకాంత్ చారి నల్తూరు యాదగిరి దీక్షిత్ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page