ఘనంగా తెలంగాణ 2కె రన్

Spread the love

ఎన్.జి కళాశాల నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు 2కె రన్


నల్లగొండ సాక్షిత ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో బాగంగా జిల్లా పోలీస్ శాఖ అధ్వర్యంలో తెలంగాణ 2కె రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్ జి కళాశాల నుండి రామగిరి వివేకానంద విగ్రహం మీదుగా క్లాక్ టవర్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఐఎఎస్, జిల్లా ఎస్పీ కె.అపూర్వారావు ఐపిఎస్ లు పాల్గొని ప్రారంభించారు. అధికారులు, విద్యార్థులు, ప్రజల పెద్ద ఎత్తున 2కె రన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
12వ బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య,అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, అడిషనల్ ఎస్పీ కె.ఆర్.కె ప్రసాద రావు, ప్రజా పతినిధులు, క్రీడాకారులు, యువతీ యువకులు,పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page