SAKSHITHA NEWS

Great for the welfare of Christians

క్రైస్తవుల సంక్షేమానికి పెద్దపీట
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
క్రైస్తవులకు ఎమ్మెల్యే జిఎంఆర్ వరాల జల్లు
రెండు కోట్ల రూపాయలతో క్రైస్తవ భవన్


స్మశాన వాటిక కోసం అతి త్వరలో స్థలం కేటాయింపు
క్రైస్తవుల సంక్షేమానికి 10 లక్షల రూపాయల విరాళం
ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో కన్నుల పండువగ సెమీ క్రిస్మస్ వేడుకలు
భారీ సంఖ్యలో హాజరైన క్రిస్టియన్లు
మంత్రముగ్ధులను చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు..
కళాకారులకు 50 వేల రూపాయలు అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్.


సాక్షిత పటాన్చెరు : ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైస్తవుల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని, ఎందుకనగా పటాన్చెరు నియోజకవర్గంలోని క్రైస్తవుల సంక్షేమం కోసం పది లక్షల రూపాయల స్వంత నిధులను అందజేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో గురువారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో సెమీ క్రిస్మస్ వేడుకలు కన్నుల పండువగ జరిగాయి. వేలాదిమంది క్రైస్తవులు తమ కుటుంబ సభ్యులతో కార్యక్రమానికి హాజరై యేసుక్రీస్తు కొనియాడుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల మూలంగా ప్రతి ఒక్కరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని అన్నారు. ప్రధానంగా పటాన్చెరు నియోజకవర్గంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని క్రైస్తవుల కోసం రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో క్రైస్తవ భవన్ నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా ప్రభుత్వంతో చర్చించి అతి త్వరలో స్మశాన వాటిక కోసం స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం చర్చిలకు అందించే నిధులతో పాటు తాను సొంతంగా 10 లక్షల రూపాయలు అందిస్తున్నానని ప్రకటించారు. వీటితో నిరుపేద క్రిస్టియన్ల సంక్షేమానికి వినియోగించాలని కోరారు. పటాన్చెరు నియోజకవర్గంలో క్రిస్టియన్ల కోసం చేపడుతున్న కార్యక్రమాలను చూసి ఇతరులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. దీంతోపాటు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

వేడుకల సందర్భంగా కళాబృందం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందని అలరించాయి. వీరిని ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యే జిఎంఆర్ 50వేల రూపాయలు బహుమతిగా అందించారు.

అనునిత్యం కంటికి రెప్పలా కష్టసుఖాల్లో అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే జిఎంఆర్ కు వెన్నంటి నిలుస్తామని క్రైస్తవులు తెలిపారు.

అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.


SAKSHITHA NEWS