రూ.7.5 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ ఓ సీలను అందజేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మల్లంపేట్ కు చెందిన వెంకటలక్ష్మి, సుచిత్రకు చెందిన ఎం. సాయి చరణ్, గాగిల్లాపూర్ తండాకు చెందిన కే. రేఖ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆర్ధిక స్థితి బాగలేకపోవడంతో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని సంప్రదించారు. స్పందించిన ఎమ్మెల్సీ ప్రభుత్వం నుండి వైద్యం కోసం వెంకటలక్ష్మి కి రూ. 3 లక్షలు, సాయి చరణ్ కు రూ.2.5 లక్షలు, కే. రేఖ కు రూ.2 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎల్ ఓ సీ లను మంజూరు చేయించారు. శంభీపూర్ లోని కార్యాలయంలో లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, కౌన్సిలర్ శంకర్ నాయక్, నాయకులు హన్మంత రావు, ఎంబరి ఆంజనేయులు, సుబ్బారావు, అమర్ సింగ్, రవి నాయక్, రంగయ్య, ప్రవీణ్ నాయక్, మేడి చంద్రశేఖర్, జగదీష్ గుప్త, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page