కొత్తపల్లిలో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికీ గాయాలు

Spread the love

సాక్షిత శంకర్‌పల్లి: గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికీ గాయాలైన ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ హాబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధి లోని కొత్తపల్లి గ్రామానికి చెందిన సత్తిరెడ్డి ఇంట్లో మధ్యాహ్నం గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. హుటాహుటిన చేవెళ్ల లోని ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్న మంటలను ఆర్పారు. ఇంట్లో ఉన్న మధుసూదన్ రెడ్డి, భారతమ్మలకు గాయాలయ్యాయి. ఎన్కేపల్లి లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Related Posts

You cannot copy content of this page