వైయస్సార్ వర్ధంతి సందర్భంగా తిరుపతి తుడా సర్కిల్ వద్ద వైయస్సార్ విగ్రహానికి పూలమాల

Spread the love

వైయస్సార్ వర్ధంతి సందర్భంగా తిరుపతి తుడా సర్కిల్ వద్ద వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి నివాళి అర్పించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్ర ఎనలేనిదని ప్రజా సంక్షేమమే ప్రాతిపధికగా ఎన్నో గొప్ప పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించిన మహానేత అని అయన సేవలని కొనియాడారు. వైఎస్సార్ మరణం రాష్ట్రానికి తీరని లోటన్నారు.

మహానేత అడుగు జాడల్లో ఆయన ఆశయ సాధన కోసం ఆయన తనయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భాగమైనందుకు గర్వంగా ఉందని మా నాయకుడు వైఎస్.జగన్మోహనరెడ్డి సారద్యంలో వైఎస్సార్ ఆశయ సాధన కోసం, బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం కృషి చేస్తామని ఆయన తెలియజేసారు.

Related Posts

You cannot copy content of this page