ప్రమాదవశాత్తు గుడిసె కాలిపోయిన బాధితులను పరామర్శించిన గద్వాల ఎమ్మెల్యే

Spread the love

బాధితులకు ఆర్థిక సహాయం అందజేత

కేటిదొడ్డి తహసీల్దార్ కు ఫోన్ చేసి బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరిన ఎమ్మెల్యే

గుడిసెలు దగ్దం: 10లక్షల ఆస్తి నష్టం

ఈరోజు గద్వాల నియోజకవర్గం కేటిదొడ్డి మండలం గంగన్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని శివగంగపురం శివారులో గల రెండు పూరి గుడిసెలు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి అయ్యాయి. దాంతో గుడిసె వాసులంతా నిరాశ్రయులయ్యారు.ఈ విషయం తెలుసుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సంఘటనస్థలానికి చేరుకొని కాలిపోయిన గుడిసె ను పరిశీలించడం జరిగింది. బాధితులను పరామర్శించారు వారి ఆర్థిక సాయం అందజేశారు.. ప్రభుత్వపరంగా ఆదుకొని బాధితులకు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ఎమ్మార్వో కు ఫోన్ ద్వారా వివరించారు వెంటనే వారిని కుటుంబ సభ్యులను ప్రభుత్వం తరఫున ఆదుకొనే విధంగా కృషి చేయాలని కోరారు.

అదేవిధంగా నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆధారపడకండి అన్ని విధాలుగా అండగా ఉంటానని బాధితులకు భరోసాను కల్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బంబు రామన్ గౌడు, జెడ్పిటిసి రాజశేఖర్, వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు చక్రధర్ రావు, ప్రతాప్ రెడ్డి, రాజేష్, వెంకటన్న గౌడ్, నర్సింహులు, కృష్ణ, గోపి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 04 At 11.34.04 Am

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page