ఉచిత కంటి పరీక్షలు మరియు కాటరక్ట్ ఆపరేషన్ల శిబిరం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి గారి అద్వర్యంలో 129 డివిజన్ (సూరారం),సంజయ్ గాంధీనగర్ లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మి సహకారంతో ఉచిత కంటి పరీక్షలు మరియు కాటరక్ట్ ఆపరేషన్ల శిబిరం నిర్వహించడం జరిగింది.
సుమారు 300 మంది పేద ప్రజలు ఈ శిబిరానికి విచ్చేసి కంటి పరిక్షలు చేయించుకోవడం జరిగింది.అవసరమైన వారికీ కళ్ళద్దాలు మరియు కాటరక్ట్ ఆపరేషన్లు చేయిస్తానని నర్సారెడ్డి భూపతిరెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 129 డివిజన్ మెంబెర్షిప్ ఇంచార్జ్ నీలి రహ్మతుల్లా,పద్మ రావు,వినోద్ కుమార్,చిన్న జార్జ్,సాల్మన్ రాజు,సైదాబీ,అచ్చెమ్మ, క్యాంపు చైర్మన్ కళ్ళెం శ్రీనివాస్ రెడ్డి,లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొట్టే మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు