దివంగత నేత కేఎం పాండు సార్ నాల్గవ వర్ధంతి…

Spread the love


fourth death anniversary of late leader KM Pandu sir…

దివంగత నేత కేఎం పాండు సార్ నాల్గవ వర్ధంతి…

పాండు సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, నేతలు…

కుత్బుల్లాపూర్ రాజకీయ పితామహులు, మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ కేఎం పాండు నాల్గవ వర్ధంతి సందర్భంగా ఈరోజు చింతల్ లోని కేఎం పాండు మార్గ్ లో ఉన్న కేఎం పాండు విగ్రహానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అదే విధంగా పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు కేఎం పాండు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసి ఎన్నో సేవలు అందించిన కేఎం పాండు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిదని, నిత్యం ప్రజా శ్రేయస్సు కోసం పాటు పడ్డ మహనీయులు పాండు గారని అన్నారు. వారి ఆశయాలు మన అందరికీ ఆచరణీయం అని, వారు నిర్దేశించిన మార్గాన్ని అనుసరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page