SAKSHITHA NEWS

ప్రజా సమస్యలపై పోరాటం చేసిన కృషి మరువలేనిది – మాజీ ఎమ్మెల్సీ సీతారాములు

చిట్యాల సాక్షిత ప్రతినిధి

ఎర్ర జెండా తరుపున పెద్దకాపర్తి గ్రామ ఉపసర్పంచ్ గా ఎన్నికై సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేసిన కొత్త అండాలు కృషి మరువలేనిదని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు.చిట్యాల మండలం పెద్ద కాపర్తి లో గురువారం నాడు జరిగిన కామ్రెడ్ అండాలు సంతాప సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూస్వాముల ప్రాబల్యం ఉన్న పెద్దకాపర్తి లో వ్యవసాయ కూలీల సమస్యలతో పాటు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటాలు చేసిన మహిళా నాయకురాలు అని కొనియాడారు.పెద్దకాపర్తిలో ఎర్ర జెండా నాయకత్వాన్ని అభివృద్ధి పర్చటమే ఆమె ఆశయసాధన కోసం కృషి చేసినట్లు అని అన్నారు.వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపి ఓదార్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, పార్టీ మండల కార్యదర్శి అరూరి శ్రీను, మండల నాయకులు లడే రాములు,రుద్రారపు పెద్దులు, గ్రామశాఖ నాయకులు బుంగ పట్ల తిమ్మయ్య,సిలివేరు నర్సింహా, కొత్త మీనయ్య,లోడె విష్ణుమూర్తి, పొట్లపల్లి యాదయ్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు‌.


SAKSHITHA NEWS