ఘనంగా తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

Spread the love

ఘనంగా తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

చిట్యాల సాక్షిత ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి పాల్గొని ఆమరుల స్థూపానికి శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించడం జరిగింది. అనంతరం చైర్మన్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆశువులు బాసిన అమరుల త్యాగాలను మరువలేనివని అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని గుర్తు చేశారు. వారి ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మందడి రామదుర్గారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి కౌన్సిలర్లు కోనేటి కృష్ణ బెల్లి సత్తయ్య సిలువేరు మౌనిక శేఖర్, జిట్టా పద్మా బొందయ్య కో ఆప్షన్ నెంబర్స్ పాటి మాధవరెడ్డి, సల్మా షుకూర్,
ఎండి జమీరుద్దీన్ రుద్రవరం పద్మ యాదయ్య, మేనేజర్ నుజాహత్ ఫాతిమా, నాయకులు, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page