నర్సాపూర్ మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ..

Spread the love

నర్సాపూర్ నియోజకవర్గం, గొల్లపల్లి గ్రామంలో జరిగిన మల్లికార్జున స్వామి జాతరలో మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు విచ్చేసిన శ్రీశైలం గౌడ్ కి డప్పు చప్పుళ్లతో ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికి, ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ గొల్లపల్లి మల్లన్న జాతరలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, మల్లన్న ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట బిజెపి నేతలు బుచ్చిరెడ్డి, ఆకుల సతీష్, మోతే శ్రీనివాస్ యాదవ్ తదితర నాయకులు ఉన్నారు.

Whatsapp Image 2024 01 24 At 4.36.11 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page