కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిని పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు

Spread the love

విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి లో కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిని పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ….

నిన్న రాత్రి కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి దీక్షను భగ్నం చేసి వైద్యం కోసం కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లిన పోలీసులు-

ఈ నేపథ్యంలో ప్రభుత్వ హాస్పిటల్ వారిని పరామర్శించి ధైర్యం తెలియచేసిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ,తెదేపా రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు, తెదేపా రాష్ట్ర SC సెల్ ఉపాధ్యక్షులు జ్యోతి బశు, జయపాల్,సమతా సైనిక్ దళ్ సభ్యులు, దళిత సంఘాలు తదితరులు పరామర్శించారు…..

ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హత్యలు చేసిన వ్యక్తులు మూడు నెలల్లో బయటకు వస్తున్నారు.

ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవరు దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంత బాబు ఆరు నెలల్లో బయటకు వస్తే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికారు.

జగన్మోహన్ రెడ్డి పై కోడి కత్తితో దాడి జరిగిందని మా దళిత సోదరుడు జన్నుపల్లి శ్రీనివాసరావు గత ఐదు సంవత్సరాల నుంచి జైల్లో మగ్గుతున్నాడు. బహుశా భారతదేశంలో ఏ పీనల్ కోడ్ ప్రకారం జైల్లో ఉంచారో అర్థం కాని విషయం.

అది 307 కేసు కూడా కాదు చిన్న దాడి, ఆరోజు శ్రీనివాసరావు చెప్పాడు నేను జగన్మోహన్ రెడ్డి అభిమానిని, ఇలా ఏదైనా చిన్న దాడి జరిగితే అది సింపతిగా మారి ఎక్కువ సీట్లు వస్తాయి అన్న ఉద్దేశంతో నేనే చేశాను అని, అదే సింపతీతో జగన్మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చాడు.

కోడి కత్తి శ్రీనివాసరావు గత ఐదు సంవత్సరాలుగా రాజమండ్రి విశాఖపట్నం జైల్లో మగ్గిపోతున్నాడు.
ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదని కోర్టుకు వెళ్లి కేంద్ర దర్యాప్తు సంస్థ NIA తో విచారణ చేయించాడు.

NIA విచారణ చేసి ఛార్జిషీట్ ఫైల్ చేసిన ఈ కేసులో ఇంకా బెయిల్ రాకపోవటం విచిత్రంగా కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా అడ్డుకుంటున్నాడో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి.

జగన్మోహన్ రెడ్డి బాబాయ్ ని అడ్డంగా గొడ్డలి పెట్టి నరికిన ముద్దాయిలు అందరూ బయట తిరుగుతున్నారు. దీనిలో భాగం ఉంది అని ఆరోపణ ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడు. తన మీద దాడి చేసిన శ్రీనివాసరావు మాత్రం జైలు ఉండిపోయాడు.

నువ్వు కోర్ట్ కి వెళ్లి సాక్ష్యం చెప్పు అంటే సాక్ష్యం చెప్పడు నువ్వు ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఎక్కువ? నీ మీద దాడి జరిగిందా లేకపోతే హత్యాయత్నం జరిగిందా? ఏది జరిగితే అది చెప్పు నువ్వు ఎందుకు చెప్పవు?

మా దళిత సోదరుడు జైల్లో మగ్గిపోతున్నాడు అతనితో పాటు అతని కుటుంబం స్నేహితులు ఎంతో బాధలు పడుతున్నారు నువ్వు ఎందుకు సాక్ష్యం చెప్పవు? అతనే చేసాడని చెప్పినా కూడా ఐదు సంవత్సరాలు
శిక్ష పడదు.

దళిత వర్గాల మీద నాలుగు సంవత్సరాల 8 నెలల కాలంలో దమనకాండ జరిగిస్తున్నావ్.

గత రెండు రోజులుగా శ్రీనివాసరావు జైల్లో ఆమన నిరాహార దీక్ష చేస్తున్నాడు దానికి పద్ధతిగా సమతానికి ఆధ్వర్యంలో శ్రీనివాసరావు తల్లి వాళ్ళ అన్న నిరాహార దీక్ష చేస్తుంటే ఈరోజు తెల్లవారుజామున దీక్ష భవనం చేసి విజయవాడ హాస్పటల్ తరలించారు ఇక్కడ హాస్పిటల్లో వీడు ఖైదీని చూసినట్టుగా చూస్తున్నారు.

ఇక్కడే అంబేద్కర్ విగ్రహం పెట్టారు ఆ విగ్రహానికి మా బాధలు చెప్పుకుంటారు కోసం వెళ్తుంటే వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.

సాక్షి అనేవాడు ఒకటికి పది సార్లు తప్పించుకుంటూ ఉంటే కోర్ట్ లు NBW ఇష్యూ చేయాలి. తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించాలి.

43 వేల కోట్ల అక్రమంగా దోచుకున్న కేసులు ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకొని తప్పించుకొని తిరుగుతున్నాడు.

అతని మీద దాడి చేశాడు అనే ఒక అమాయక వ్యక్తిని జైల్లో పెట్టించి సాక్ష్యం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.

ఇంకా ఎంతకాలం తప్పించుకో తిరుగుతావ్ జగన్మోహన్ రెడ్డి? ప్రజాక్షేత్రంలో ప్రజల నుంచి తప్పించుకోగలవా? రాబోయే 80 రోజుల్లో నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడైతే తప్పించుకోగలవేమో గాని అప్పుడు మాత్రం నువ్వు తప్పించుకోలేవు అని హెచ్చరిస్తున్నాము…

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page