SAKSHITHA NEWS

కొడేర్ మండలం తీగలపల్లి గ్రామంలో ఏపూరి ఎల్లయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎపూరి ఎల్లయ్య భౌతికకాయానికి పూలమాలతో నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనో దైర్యం కల్పించారు.

అదే గ్రామానికి చెందిన ఈడిగె వీరయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తిగలపల్లి గ్రామంలో ఈడిగే వీరయ్య భౌతికకాయానికి పూలమాలతో నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కొడేర్ మండల మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీ లు, తిగలపల్లి గ్రామ ప్రస్తుత,మాజీ ప్రజాప్రతినిధులు,మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు.


SAKSHITHA NEWS