పోలీస్ కుటుంబాలకు ఆర్థిక భరోసా – యస్.పి కె.అపూర్వ రావు ఐపీఎస్

Spread the love

పోలీస్ కుటుంబాలకు ఆర్థిక భరోసా – యస్.పి కె.అపూర్వ రావు ఐపీఎస్
— అనారోగ్యంతో మరణించిన ఏ ఎస్ ఐ కుటుంబానికి చెక్కు అందజేత

పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తామని భరోసా
నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి)

కేతపల్లి పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న వెంకటయ్య అనారోగ్యంతో మరణించడంతో వారి సతీమణి లక్ష్మికి 7 లక్షల 45వేల రూపాయల భద్రతా చెక్కుని జిల్లా యస్.పి అపూర్వరావు అందజేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా యస్.పి మాట్లాడుతూ చనిపోయిన పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ది సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని చెప్పారు. పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో చనిపోయిన పోలీస్ కుటుంబాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఓ మంజు భార్గవి, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్ పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page