సితాఫలమండీ లో కొత్త గా నిర్మిస్తున్న ప్రభుత్వ స్కూల్, కాలేజీల భవనాల నిర్మాణాల పనులను వేగవంతం

Spread the love

సాక్షిత సికింద్రాబాద్ : సితాఫలమండీ లో కొత్త గా నిర్మిస్తున్న ప్రభుత్వ స్కూల్, కాలేజీల భవనాల నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సితాఫలమండీ లో కొత్త భవనాల నిర్మాణం పనులను అయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్కూల్, కాలేజి అవసరాలను, మున్ముందు రోజుల్లో అవసరమైన సదుపాయాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓ మోడల్ గా నిలిచేలా భవనాలను నిర్మించాలని సూచించారు. కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునీత, నేతలు, అధికారులు పాల్గొన్నారు.


పోలీసు స్టేషన్లకు అనువైన భవనాలు
చిలకలగుడా, వారసిగుడా, లాలాగూడ పోలీస్ స్టేషన్ లకు కొత్త భవనాలను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు. చిలకలగూడ ఏ సీ పీ శ్రీనివాస్, ఇనిస్పెక్టర్ శంకర్ తదితరులు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తో సితాఫలమండీ క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ బౌద్దనగర్ డివిజన్ పరిధిలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Related Posts

You cannot copy content of this page