గండేపల్లి గ్రామంలో NRUM నిధులు రూ.20.80 లక్షల అంచనా వ్యయం

Spread the love

గండేపల్లి గ్రామంలో NRUM నిధులు రూ.20.80 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన Y.S.R. విలేజ్ హెల్త్ క్లినిక్ ను ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

గండేపల్లి గ్రామంలో కేడిసిసిబి నిధులు రూ.9.35 లక్షల అంచనా వ్యయంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లి. యొక్క నూతన స్ట్రాంగ్ రూమ్ మరియు క్యాష్ కౌంటర్ ను ప్రారంభించిన కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ తాతినేని పద్మావతి, MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

వైయస్ఆర్ విలేజ్‌ క్లినిక్స్‌తో ప్రజలకు ఆరోగ్య భరోసా.. గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా 2,500 జనాభాకు ఒకటి చొప్పున ప్రతి గ్రామంలో ఆసుపత్రుని సీఎం జగనన్న ప్రభుత్వం నిర్మించింది : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

దీంతో చిన్న చిన్న జబ్బులకు కూడా 10 కిలోమీటర్ల దూరంలో ఉండే పీహెచ్‌సీకి వెళ్లాల్సిన అవసరం లేకుండా.. విలేజ్ క్లినిక్‌లో 12 రకాల వైద్య సేవలు అందించడంతో పాటు 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 65 రకాల మందులతో పాటు 67 రకాల బేసిక్‌ మెడికిల్‌ ఎక్విప్‌మెంట్‌ అందుబాటులో ఉంటుంది ..

అన్నదాతల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సహకార సంఘాల బలోపేతానికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుంది.. కేడీసీసీబీ విస్తృతమైన సేవలను అందుబాటులోకి తీసుకువస్తూ.. పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేస్తుంది : చైర్మన్ తాతినేని పద్మావతి ..

ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు ..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page