SAKSHITHA NEWS

సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 2,00,000/- రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF-LOC మంజూరి పత్రాలను బాధిత కుటుంబాలకి అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2,00,000/- రూపాయలు మంజూరి అయినవి అని,

CMRF- LOC వివరాలు

1.వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని మాధవరం నగర్ కాలనీ కి చెందిన శ్రీనివాసరావు కి 1,00,000/- ఒక లక్ష రూపాయలు.

2.కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కాలనీ కి చెందిన శివ కి 1,00,000/- ఒక లక్ష రూపాయలు.
మొత్తం 2 లక్షల రూపాయలు
మంజూరి అయినవి అని అదేవిధంగా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని గాంధీ పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. ప్రభుత్వ విప్ గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS