SAKSHITHA NEWS

గత ఎన్నో సంవత్సరాలుగా ఉన్న కరెంటు సమస్య మరియు సీసీ రోడ్ విస్తరణ సమస్య నేటితో ముగుస్తున్న సందర్బంగా స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఆధ్వర్యంలో సుమారు 65.40 సీసీ రోడ్ శంకుస్థాపన మరియు 11kv లైన్ కొరకు పనులకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,ఛైర్మెన్ భూపాల్ రెడ్డి,సహచర కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని శంకుస్థాపన చెయ్యడం జరిగింది.

అలాగే కాలనీ లో సమస్యలు పరిష్కరించినందుకు కాలనీ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే,ఛైర్మెన్,కార్పొరేటర్ లకు సన్మానించడం జరిగింది.అనంతరం ఎమ్మెల్యే,కార్పొరేటర్లు,కాలనీ కార్యవర్గం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులకు కరెంటు సమస్య పరిష్కరించినందుకు సన్మానించడం జరిగింది.వారితో కాలనీ అధ్యక్షులు చంద్రశేఖర్ గుప్త,రాజేశ్వర్ రెడ్డి,మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య,సర్కిల్ ప్రెసిడెంట్ పరమేష్ యాదవ్,జగన్నాథ్ రెడ్డి,కుమార్ గౌడ్,మల్ల రెడ్డి,నాగభూషణం,రాజి రెడ్డి,రాణి యాదవ్,ప్రీతీ గౌడ్,రమేష్,టౌన్ మరియు సర్కిల్ విభాగ నాయకులూ,కాలనీ అసోసియేషన్ సభ్యులు.


SAKSHITHA NEWS