మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసం వద్ద ఉత్కంఠ నెలకొంది

Spread the love

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసం వద్ద ఉత్కంఠ నెలకొంది. మైనంపల్లి నివాసానికి మల్కాజిగిరి, మెదక్ నియోజకవర్గాల నుంచి భారాస కార్యకర్తలు, కార్పొరేటర్లతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇటీవల తిరుమలలో మంత్రి హరీశ్ రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన భవిష్యత్ కార్యాచరణపై విస్తృత చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో తన కుమారుడు రోహిత్ కోసం మెదక్ అసెంబ్లీ టికెట్ ను భారాస నిరాకరించడంతో అనుసరించాల్సిన వ్యూహాలపై అనుచరులతో మైనంపల్లి చర్చించనున్నట్లు సమాచారం. కాసేపట్లో కార్యకర్తలలో మాట్లాడనున్నారు. ఆయన నివాసానికి కాంగ్రెస్ నాయకులు కూడా వస్తున్నారు. మైనంపల్లి నాయకత్వం వర్ధిల్లాలంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు..

Related Posts

You cannot copy content of this page