భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీ సమావేశంలో పాల్గొన్న దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్లు..

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 లో కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధులుగా మున్సిపల్ కౌన్సిలర్లు శంభిపూర్ కృష్ణ , నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. గత వర్షాకాలంలో కురిసిన వానలకు కాలనీ నీట మునగడం జరిగింది. వర్షపు నీరు బయటకు తరించేందుకు నూతన డ్రైనేజీ ను నిర్మించే విధంగా సహకరించాలని కోరుతూ సమావేశం ఏర్పాటు చేసి కౌన్సిలర్లకు తెలియజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ MLC , MLA మరియు స్థానిక మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల సహాయం తీసుకొని శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంగం సభ్యులు మరియు కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page