బీసీల ద్రోహి డీకే అరుణకు టిక్కెట్ ఇవ్వొద్దు..! ఉమ్మడి పాలమూరు జిల్లా బీసీ ఐక్యవేదిక డిమాండ్.

Spread the love

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుండి బిజెపి పార్టీ అభ్యర్ధిగా డీకే అరుణకు టికెట్ ఇవ్వద్దని ఉమ్మడి పాలమూరు జిల్లా బీసీ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన గద్వాలలో బీసీ అభ్యర్థికి టిక్కెట్ ఇస్తే డీకే అరుణ తన కుటుంబ సభ్యుల విజయంకోసం బీసీ అభ్యర్థిని అనుగదొక్కలని చూసింది. కాబట్టి అలాంటి బీసీల ద్రోహికి ఎంపీ టిక్కెట్ ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వొద్దని ఈ రోజు బీసీ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు జూలూరి మహేష్ గౌడ్ మహబూబ్నగర్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై త్వరలోనే ఢిల్లీకి వెళ్లి అమిత్అని కలిసి డీకే అరుణకు పార్టీ టిక్కెట్ కేటాయించొద్దని ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు….

Related Posts

You cannot copy content of this page