రైతన్నకు అండగా DNR.
-యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు విజయుడు.

Spread the love

ఊర్కొండ మండల కేంద్రానికి చెందిన రైతు కాటన్ జంగయ్య యొక్క ఖరీదైన పాలిచ్చే ఆవు మూడు రోజుల క్రితం కరెంట్ షాక్ కు గురై మృత్యువాత పడింది. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఈ విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, జననేత, పేదల పెన్నిధి, ఊర్కొండ మండల టైగర్ ద్యాప నిఖిల్ రెడ్డి కి తెలియజేసారు.తక్షణమే స్పందించిన నిఖిల్ రెడ్డి “DNR యువసేన” పేరిట 5000/- తక్షణ ఆర్ధిక సహాయం అందజేశారు.ఈ నగదును కాంగ్రెస్ నాయకులు,యువసేన సభ్యులు జంగయ్యకు అందజేశారు.ఈ సందర్భంగా నిఖిలన్నకు, రైతు జంగయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కంఠం విజయుడు,వార్డు సభ్యులు రవి మరియు కాంగ్రెస్ నాయకులు యాదయ్య, వెంకటేష్, దయాకర్,ఆది తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కంఠం విజయుడు మాట్లాడుతూ…. ఊర్కొండ మండల ప్రజలను ఎల్లవేళలా ఆదుకుంటూ, ఎవరికి ఏ ఆపద వచ్చినా,అన్నా…అంటే నేనున్నా అంటూ,తన సహాయ సహకారాలు అందిస్తున్న ద్యాప నిఖిలన్న గరిబోళ్ల గుండెల్లో గుడి కట్టుకున్నారని, నిరుపేద కుటుంబాలకు పెద్ద కొడుకు అయ్యారని, నిఖిల్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తునందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page