ప్రజా సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి

Spread the love
Public issues to MLA's attention

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బ్లాక్ కాంగ్రెస్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లురవి తరపున ప్రచారంలో భాగంగా ఒకటో వార్డు రాయగడ్డకు విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు

అందులో భాగంగా సమాజ్వాది పార్టీ జిల్లా అధ్యక్షులు జానంపేట రాములు నివాసానికి వెళ్లి పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేసి ఓటర్ల చేత వేయించి ఆయన గెలుపుకు కృషి చేయాలని ఇండియా కూటమి లో భాగంగా సమాజ్వాద్ పార్టీ జిల్లా అధ్యక్షులునీ ఎమ్మెల్యే కోరారు

ఎమ్మెల్యే తన నివాసానికి విచ్చేసిన సందర్భంగా సమాజవాది పార్టీ జిల్లా అధ్యక్షులు ఆయనను శాలువాతో సన్మానించి స్వాగతించారు

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏర్పడిన ఇండియా కూటమి స్నేహం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి స్నేహ హస్తంతో సహకరించాలని పార్టీ ఆదేశాలు ఉన్నాయని కాబట్టి నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి గెలుపుకు కృషి చేస్తామని హామీని ఇచ్చారు

అలాగే పట్టణం వార్డులోఉన్న సమస్యల సిసి రోడ్లు డ్రైనేజీలు మంచినీటి సమస్యలు తో పాటు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సమాజవాది పార్టీ జిల్లా అధ్యక్షులు జానంపేట రాములు కోరారు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల అనంతరం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు జిల్లా అధ్యక్షులు తెలిపారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట మాజీ కౌన్సిలర్ చుక్కా రాజు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

Sakshitha News
Download app

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

Sakshitha Epaper
Download app


Public issues to MLA's attention

Related Posts

You cannot copy content of this page