మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ప్రజలను మోసం చేసిన డబ్బులతోనే చీరలు పంపిణీ

Spread the love

మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ప్రజలను మోసం చేసిన డబ్బులతోనే చీరలు పంపిణీ చేస్తున్నాడని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు విమర్శించారు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఖరి పై ఘాటు గా స్పందించారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు అవినీతి బాగోతాలు నియోజకవర్గ ప్రజలకు తెలుసునని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతల వద్ద కోట్ల రూపాయలను వసూలు చేసి మోసం చేసిన ఘనత ప్రేమ్ సాగర్ రావుకి దక్కింది. సుమారు 6 కోట్ల రూపాయలు వసూలు చేయడంతో సొంత పార్టీ నేతలే గాంధీభవన్లో ఫిర్యాదు చేశారని ఆరోపించారు. ప్రేమ్ సాగర్ జీవితమే అవినీతి బాగోతం అని చేశారు. నమ్మిన నాయకులు కార్యకర్తలను మోసం చేయడంలో ప్రేమ్ సాగర్ రావు ను మించిన వ్యక్తి లేరని విమర్శించారు. ప్రేమ్ సాగర్ రావు తన సొంత ఇంటి నిర్మాణం కోసమే వ్యాపారులను బెదిరించి నేటికీ డబ్బులు ఇవ్వని చరిత్ర ఉందని ఇప్పటికి కూడా వ్యాపారులు ఆ డబ్బుల కోసం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు…

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య,నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, లక్షెట్టిపేట మున్సిపల్ చైర్మన్ నల్మస్ కాంతయ్య, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు….

Related Posts

You cannot copy content of this page