సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులు పంపిణీ..

Spread the love

20 మంది లబ్ధిదారులకు రూ..21.40 లక్షలు పంపిణీ..*
-నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ..
నరసరావుపేట నియోజకవర్గంలో పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.

నరసరావుపేట లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం 20 మంది లబ్దిదారులకు 21 లక్షల 40 వేల రూపాయల చెక్కులను నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డా౹౹గోపిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తోందని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు.

రాష్ట్రంలో వైద్యం, విద్యకు సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని, రాష్ట్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు భయపడవద్దని ప్రభుత్వం తరపున ఆర్ధిక సహాయం అందిస్తామని డా౹౹గోపిరెడ్డి భరోసా ఇచ్చారు. ఎవరైనా బాధితులు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోవచ్చునని ఈ సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సూచించారు..

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page