కేటీఆర్ ను సీఎం చేసేందుకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోడీని కెసిఆర్ కోరా లేదా:

Spread the love

కేటీఆర్ ను సీఎం చేసేందుకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోడీని కెసిఆర్ కోరా లేదా: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్:
తెలంగాణ అసెంబ్లీ దద్దరి ల్లింది. అసెంబ్లీ వేదికగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య ఆరుగ్యారెంటీలు, రాజకీయ అంశాలపై వాడీవేడి చర్చ జరిగింది. అసెంబ్లీలో గవర్నర్‌కు ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య స్నేహం ఉందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు.

దీనిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్పందించారు. తమకు బీజేపీతో ఎలాంటి స్నేహం లేదని.. ఎంఐఎం ఒక్కటే తమకు ఫ్రెండ్లీ పార్టీ అని అన్నారు. అయితే పోచారం వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ది ఫెవికాల్ బంధమని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన అనేక బిల్లులకు బీఆర్‌ఎస్ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. కేటీఆర్‌ను సీఎం చేసేందుకు సహకరించాలని ప్రధాని మోదీని కేసీఆర్ కోరారని.. ఈ విషయాన్ని మోదీ స్వయంగా చెప్పారని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు పోచారం శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థులను బీఆర్‌ఎస్ ఓడించిందని గుర్తు చేశారు. ఒకవేళ గతంలో కేటీఆర్‌ను సీఎం చేయాలనుకుంటే.. తామే వందమంది ఉన్నామని చెప్పారు.

కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారంటీల్లో ఏ ఒక్కటి సరిగ్గా అమలు కావడంలేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అసెంబ్లీలో ఫ్రీ బస్సు, ఆటోడ్రైవర్ల ఇష్యూపై ప్రభుత్వాన్ని నిలదీశారు. దానికి అదే స్థాయిలో కౌంటరిచ్చారు

మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌.. కాంగ్రెస్‌ది ప్రచారం తప్ప..హామీల అమలు ఊసేలేదని మండిపడ్డారు BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి. ప్రచారం తప్ప..హామీల అమలు లేదని మండి పడ్డారు. ఫ్రీ బస్సుతో మహి ళలఇబ్బంది పడుతున్నా రని, మరిన్ని బస్సులు పెంచాలని కోరారు…

Related Posts

You cannot copy content of this page