SAKSHITHA NEWS

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మండలం తాళ్ళ వెళ్ళాంల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చికిలంమెట్ల సైదులు అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంతుండటంతో వారి ఇంటికి కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్
దైద రవీందర్ పరామర్శించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు షేక్ సలీం అనారోగ్యంతో ఉండడంతో ఇంటిదగ్గర వారిని పరామర్శించి ఆరోగ్య వివరాలు తెలుసుకొని చెరో 5 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో
చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనరసింహ, మాజీ సింగిల్ విండో చైర్మన్ గార్లపాటి రవీందర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చంద్రమౌళి , చిట్యాల మండల జనరల్ సెక్రెటరీ శివ , పెద్దులు , దొడ్డి ముత్తయ్య , మహేష్ , కోటేష్ , జానపాటి వినయ్ , విష్ణువర్ధన్, వంటెపాక సతీష్ తదితరులు పాల్గొన్నారు
.


SAKSHITHA NEWS