ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి…

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి…

SAKSHITHA NEWS

రూ.30 లక్షలతో జీడిమెట్ల డివిజన్ పలు అభివృద్ధి పనులకు వెంకటేశ్వర కాలనీ కమ్యూనిటీ హాల్ పనులకు, వెన్నెలగడ లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,132 డివిజన్ జీడిమెట్ల పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో రూ.10లక్షలతో నూతనంగా చేపడుతున్నకమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు రూ.20 వెన్నెలగడ లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. కమ్యూనిటీ హాళ్లు, కల్వర్టులు తదితర మౌలిక సదుపాయాలకు నిధుల కొరత లేదని, ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ అదనంగా అభివృద్ధి పనులకు ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతీ కాలనీని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 09 15 at 19.02.38

SAKSHITHA NEWS