డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఇంటింటి ప్రచారం

Spread the love

కరోనా సమయంలో కూడా అందుబాటులో ఉన్నామని వెల్లడి * స్థానికుల నుంచి మంచి స్పందన * పద్మారావు కు పూర్తి మద్దతు తెలిపిన వివిధ సంఘాల నేతలు
సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ ప్రజల సంక్షేమమే పరమావధిగా వ్యవహరిస్తున్నామని, నిరంతరం ప్రజలకు సేవలను అందిందే కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు కరోనా రోజుల్లో కూడా ప్రజలను ఆదుకున్న ఘనత తమదే నని డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీ ఆర్ ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. తన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం సితాఫలమండీ డివిజన్ లో రెండో రోజు పాదయాత్రను నిర్వహించారు.

కార్పొరేటర్ సామల హేమ, నేతల అధ్వర్యంలో సితాఫలమండీ డివిజన్ పరిధిలో నామాలగుండు, ఉప్పరి బస్తీ, బ్రాహ్మణా బస్తీ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. పద్మారావు గౌడ్ నిర్వహించిన పాదయాత్రకు స్వాగతం లభించింది. కార్పొరేటర్ కంది శైలజ, బీ ఆర్ ఎస్ యువ నాయకులు కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, కిరణ్ కుమార్, త్రినేత్ర గౌడ్, నేతలు కరాటే రాజు, కంది నారాయణ, తదితరులతో పాటు సితాఫలమండీ డివిజన్ కు చెందిన చెందిన నేతలందరూ ఈ కార్యక్రమలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి కష్ట సుఖాల్లో భాగస్వామ్యమవుతున్నామని తెలిపారు.

కేవలం ఎన్నికలు, ఓట్ల కోసం కాకుండా ప్రజలు కరోనా రోజుల్లో ఇబ్బంది పడ్డ దశలో తమ వ్యక్తిగత సాయం అందించమని, ఆక్సిజన్ సిలిండర్ లు, ఇంజక్షన్ లు , నిత్యావసర సరకులు సమకుర్చమని పద్మారావు గౌడ్ తెలిపారు. చాతాద శ్రీవైష్ణవ సంఘం తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు అశ్వాపురం వేణుమాధవ్ మాట్లాడుతూ ప్రజా ఇబ్బందులను పరిష్కరించిన నేతలు చిరకాలం వారి గుండెల్లో నిలుస్తారని అన్నారు. ముఖ్యమంత్రిగా కెసిఆర్, సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ గా తాము విజయం సాధించటం సాధించడం ఖాయమని అన్నారు. పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ ను సమస్యల రహిత ప్రాంతంగా మార్చారని వేణుమాధవ్ అన్నారు. — సికింద్రాబాద్ నియోజకవర్గ బీ ఆర్ ఎస్ కార్యాలయం.

Whatsapp Image 2023 10 21 At 4.26.05 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page