నిజాంపేట్ జిల్లా పరిషత్ హైస్కూల్లో అగస్త్య ఫౌండేషన్ విద్య వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించిన డిప్యూటీ మేయర్

Spread the love

నిజాంపేట్ జిల్లా పరిషత్ హైస్కూల్లో అగస్త్య ఫౌండేషన్ విద్య వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించిన డిప్యూటీ మేయర్ & కార్పొరేటర్లు
సాక్షిత : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 30వ డివిజన్ లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో అగస్త్య ఫౌండేషన్ మరియు ప్రధానోపాధ్యాయుడు మూర్తి ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులచే ఏర్పాటు చేయించిన విద్య వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ . విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్కు సంబంధించిన తయారుచేసిన పరికరాలను పరిశీలించారు. విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో బాగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన వారికి పారితో షకాలను అందజేశారు. అలాగే విద్యార్థిని విద్యార్థులతో విద్య వైజ్ఞానిక ప్రదర్శనచేయించిన ఉపాధ్యాయులను & అగస్త్య ఫౌండేషన్ వారిని అభినందించారు.విద్యార్థులను ప్రశంసిస్తూ వారు ఇంకా పై స్థాయికి వెళ్ళి నిజాంపేట్ పాఠశాల ప్రతిష్ఠను నిలపాలని అభినందించారు.ఇలాంటి సందర్భాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభకు పదును పెట్టుకోవాలన్నారు . ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్, సురేష్ రెడ్డి, రవి కిరణ్, సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్, ఎన్ ఎమ్ సి బిసి సెల్ ఉపాధ్యక్షుడు సాయి ముదిరాజ్,14 వ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షుడు బోబ్బా శ్రీనివాస్, అగస్త్య ఫౌండేషన్ ప్రతినిధులు త్రివేణి, మాచం లింగం, విద్యార్థి ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page