గుర్రం జాషువా వర్ధంతి

Spread the love

పద్మ భూషణ్, కళా ప్రపూర్ణ, కవికోకిల, కవితా విశారద, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా, వినుకొండ పట్టణంలోని జాషువా కళాప్రాంగణం నందు గల గుర్రం జాషువా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుర్రం జాషువా వినుకొండ ప్రాంతంలో జన్మించడం మన అదృష్టం అని అన్నారు. జాషువా కవి గొంతెత్తి పద్యాలు పాడితే పండిత వర్గం వారు కూడా మెచ్చుకోకుండా ఉండలేరని, త‌న పదునైన క‌విత్వం ద్వారా సమాజంలోని దురాచారాలను ప్రశ్నించి ఆలోచింపజేసిన కవి గుర్రం జాషువా ని తెలిపారు. అణగారిన ప్రజల ఆత్మగౌరవం కోసం పాటుబడిన న‌వ‌యుగ క‌వి చ‌క్ర‌వ‌ర్తి ఆయన. తెలుగు వారికి ఎన్నో ఆణిముత్యాల్లాంటి ర‌చ‌న‌ల‌ను అందించారని అన్నారు.

Related Posts

You cannot copy content of this page