దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోంది

Spread the love

కొత్తగా 2,14,242 మందికి వైద్య పరీక్షలు చేయగా.. 7,830 మందికి వైరస్ సోకినట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ముందు రోజు ఐదువేలకు పైగా నమోదైన కొత్త కేసుల సంఖ్య.. ప్రస్తుతం అమాంతం పెరిగింది.

ఏడునెలల అత్యధికానికి చేరింది. దాంతో రోజువారీ పాజిటివిటీ 3.65 శాతానికి చేరింది.

తాజా వ్యాప్తితో క్రియాశీల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.

ప్రస్తుతం వాటి సంఖ్య 40వేల(0.09శాతం)కు చేరింది. రికవరీ రేటు 98.72 శాతంగా నమోదైంది.

కేంద్రం 11 మరణాలను ప్రకటించగా.. మొత్తంగా 5,31,016 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇప్పటి వరకూ 220.66 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page