నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణo

Spread the love

భారతి నగర్ డివిజన్ పరిధిలోని MIG కాలనీ రూ. 60 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి మరియు జలమండలి అధికారులు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మెరకు మరియు మా కార్పొరేటర్లు, మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్ కి ఒక కిలో మిటర్ (1Km) మేర చొప్పున భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులు మంజూరి అయినవి అని దానిలో భాగంగా ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు,అత్యవసరం ఉన్న చోట , నిత్యం పొంగుతున్న ప్రాంతలలోప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.

. ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ,కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరునని, అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, UGD వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది.

పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది , నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని, అదేవిధంగాసంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :

మంజూరైన అభివృధి పనుల వివరాలు…

1.MIG కాలనీ లో రూ 60.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే UGD నిర్మాణ పనులు.

పైన పేర్కొన్న UGD పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

మరియు ఇందీర గాంధీ మహిళ మండలి భవన ప్రారంభోత్సవం చేశారు.అలాగే థీమ్ పార్క్ సందర్శించడం,ఎఫ్ పార్క్ ను త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. మరియు సంకల్ప గ్రౌండ్ లో అతి త్వరలో షేడ్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు.

భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎం.ఐ.జి కాలనీ సిర్కి ఆఫీస్ వద్ద నిర్వహించిన బస్తి బాట కార్యక్రమంలో బాగంగా ఇంజనీరింగ్ మరియు జలమండలి అధికారులతో ఇటీవల వేసిన మంచి నీటి పైపు కనెక్షన్లు,రోడ్లపై ప్రత్యేక సమీక్ష సమావేశం ను కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి తో కలిసి నిర్వహించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ
కొత్త మంచి నీటి పైపులైన్ నుంచి నీరు సరిపోవడం లేదు ఆని తెల్పడం తో 15 రోజుల్లో సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట వాల్స్ బిగించి సత్వరం పరిష్కరించాలని జలమండలి అధికారులను ప్రభుత్వ గాంధీ ఆదేశించారు.

ఈ కార్యక్రమం లో అధికారులు DE రమేష్ AE రమేష్, జలమండలి మేనేజర్ సుబ్రమణ్యం మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్,నాగమణి,బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, MIG కాలనీ బి.అర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు భాస్కర్ ముదిరాజ్,మహిళ అధ్యక్షురాలు జ్యోతి,వార్డ్ మెంబర్ తిలావత్,బి.అర్.ఎస్ నాయకులు సంపత్ గౌడ్,కుమార్,చిన్న,మని,అద్నాన్ మరియు మహిళ నాయుకులు అనిత,బేబీ,మంజుల,లక్ష్మీ,స్వర్ణ లత,రాణీ,శ్రీలత,శ్రీదేవి,సుధ,సీనియర్ సిటిజన్స్ రాధాకృష్ణ,సత్యనారాయణ,వెంకట్ రెడ్డి, సుబ్బా రావు,యూత్ నాయకులు రాకేష్, టీంకు, నిషాంత్, బినూ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page