మున్సిపాలిటీ బడ్జెట్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసన ధర్నా

Spread the love

మున్సిపాలిటీ బడ్జెట్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసన ధర్నా

నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి)

నకిరేకల్ మున్సిపాలిటీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ తూతూ మంత్రంగా ఆమోదించుకున్నారని కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి దైద రవీందర్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దైద రవీందర్ వాస్తవంగా కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ గాని బడ్జెట్ సమావేశానికి హాజరై ఆమోదించాలి కానీ అలా చేయకుండా వారికి ఇష్టం వచ్చినట్టు ఆమోదించుకున్నందుకు నిరసనగా మరియు మునిసిపాలిటీ ఆధీనంలో ఉన్న నర్సరీ జాగా 700 గజాల భూమి ప్రయివేటు వ్యక్తుల చేతిలోకి ఎలా పోయింది అని దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ మునిసిపాలిటీ కార్యాలయం ముందు నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page