కామ్రేడ్ కొండా చరణ్ ను వెంటనే విడుదల చేయాలి…. సి పి ఐ యంఎల్

Spread the love

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
సి పి ఐ యంఎల్ ప్రజాపంథా భద్రాచలం డివిజన్ కార్యదర్శిగా పని చేస్తున్న కామ్రేడ్ కొండా చరణ్ ను చర్ల పోలీసులు ఉపా, రాజద్రోహo చట్టాలను మోపి అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పార్టీ రాష్ట్ర కమిటీ , నిరసన తెలియ చేయండనికి పిలుపు నివ్వటం జరిగింది. ఈమేరకు అశ్వారావుపేట పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.


ఈసందర్భంగా సి పి ఐ యంఎల్ ప్రజాపంథా పాల్వంచ డివిజన్ కార్యదర్శి గోకినెపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలకోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న కామ్రేడ్ కొండా చరణ్ ను చర్ల పోలీసులు కుట్ర పన్ని తప్పుడు కేసులు పెట్టి జైలులొ పెట్టడాన్ని ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు.
కామ్రేడ్ కొండా చరణ్ పై పెట్టిన ఉపా, రాజద్రోహo చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని సి పి ఐ యం ఎల్ ప్రజాపంథా అశ్వారావుపేట మండల కమిటీ డిమాండ్ చేశారు ‌‌.


పై కార్యక్రమంలో సి పి ఐ యంఎల్ ప్రజాపంథా భద్రాద్రి కొత్త గూడెం జిల్లా నాయకుడు కంగాల కల్లయ్య, సి పి ఐ యంఎల్ ప్రజాపంథా అశ్వారావుపేట మండల కార్యదర్శి వాసం బుచ్చిరాజు, పి వై ఎల్ మండల అధ్యక్షుడు బాడిస లక్ష్మణ్ రావు, పి వై ఎల్ మండల సహకార్యదర్శి కంగాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page