క్రికెట్ స్టేడియం పనులు త్వరగా పూర్తి చేయండి.

Spread the love

కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

*
సాక్షిత : * నగరపాలక సంస్థ పరిధిలోని గొల్లవానిగుంటలో ఏర్పాటు చేసిన క్రికెట్ స్టేడియం లో జరుగుతున్న పనులు త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలో గల ఆటోనగర్ లోని గోల్లవానిగుంటలో ఏర్పాటు చేసిన క్రికెట్ స్టేడియం పనులు, గుంట బండ్ డెవలప్మెంట్ పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలసి కమిషనర్ హరిత ఐఏఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్రికెట్ స్టేడియం లో జరుగుతున్న అన్ని పనులు త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేయాల్నారు.

ముఖ్యంగా ప్లేయర్స్ ఉండేందుకు నిర్మిస్తున్న డ్రెస్సింగ్ రూమ్, గ్యాలరీ నిర్మాణ పనులు పూర్తి చేయాలని అన్నారు. స్టేడియంలో నీళ్ళు నిలవకుండా చుట్టూ ఏర్పాటు చేస్తున్న కాలువ నిర్మాణం, స్పింక్లర్ల ఏర్పాటు చేయాలన్నారు. పిచ్ పైన, గ్రౌండ్ ఉన్న పచ్చికను కట్ చేయాలని అన్నారు. అలాగే ప్రహరీ గోడ , ప్రవేశ మార్గం ఆర్చిని ఏర్పాటు చేయాలని అన్నారు. బండ్ పై ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్, పెవ్మేంట్ పనులను పరిశీలించారు. బండ్ చుట్టూ ఏర్పాటు చేసిన రైలింగ్ ను పరిశీలించి పెయింటింగ్ చేయించాలని అన్నారు. అన్ని పనులు మరింత నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, డి.ఈ. విజయకుమార్ రెడ్డి, ఏఈకామ్ సంస్థ ప్రతినిధి బాలాజీ, తదితరులు ఉన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page