బి అర్ ఏస్ యువజన విభాగం ఆధ్వర్యంలో ఎంపీ బండి సంజయ్ పై ఫిర్యాదు

Spread the love

బి అర్ ఏస్ యువజన విభాగం ఆధ్వర్యంలో ఎంపీ బండి సంజయ్ పై ఫిర్యాదు

బండి సంజయ్ నీ అరెస్ట్ చేయాలని ఫ్లెక్సీ ల దహనం
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఎమ్మెల్సీ కవిత పై బండి సంజయ్ చేసిన వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యల పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం టూ టౌన్ పీఎస్ లో బిఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ…

బండి సంజయ్ వ్యాఖ్యలు మహిళా లోకం సిగ్గుపడే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితకు బేషరత్ గా క్షమాపణ చెప్పాలనీ డిమాండ్ చేశారు. అనంతరం బండి సంజయ్ ఫ్లెక్సీలు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం నగర అధ్యక్షులు దేవభక్తిని కిషోర్, ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్ కుమార్ ,సరిపూడి గోపి,చిక్కుళ్ళ నాని,విజేత,క్రాంతి,వెంకటేశ్వర్లు,సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page