స్మార్ట్ సిటీ పనులను సమీక్షించిన కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్

Spread the love

సాక్షిత తిరుపతి నగరం:
తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన పనులపై స్మార్ట్ సిటీ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, పనులు చేపట్టిన కాంట్రాక్టర్లతో తిరుపతి స్మార్ట్ సిటీ ఎం.డి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ సమీక్షించారు. ఐట్రిపుల్ సి పనులు చాలా నెమ్మదిగా నడుస్తున్నాయని, పనులు వేగవంతం చేయాలన్నారు. కచ్చఫి ఆర్ట్ బ్లాక్ వద్ద ఏర్పాటు చేయబోవు కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.

వినాయకసాగర్లో పూర్తి చేయవల్సిన పనులపై సమీక్షిస్తూ పనుల వేగవంతంపై దృష్టి సారించాలని, వినాయకసాగర్ ముందర నిర్మించే షాపు నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా మల్టి లెవల్ కార్ పార్కింగ్ పనులు, ఇతర పనుల స్థితి గతులపై చర్చించి పనుల వేగవంతానికి కాంట్రాక్టర్లు పని చేయాలని, నిర్మాణాల పనులపై అధికారులు దృషి సారించాలని తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఎం.డి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ తెలిపారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈఈ విజయకుమార్ రెడ్డి, ఏయికాం సంస్థ ప్రతినిధి భాలాజీ, స్మార్ట్ సిటీ సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page