SAKSHITHA NEWS

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati తిరుపతి నగరం

tirupati తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని మార్కెట్లకు, పార్కింగ్ స్థలాలకు సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలమునకు 13-7-24 నుండి ధరఖాస్తు చేసుకోవచ్చునని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ ఓక ప్రకటనలో తెలిపారు. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ సముదాయము, రామచంద్ర గుంటకట్ట కూరగాయల మార్కెట్, జంతు వధశాల, పార్కింగ్ స్థలాలకు మార్చి 31, 2025 వరకు రుసుము వసూలు చేసుకొనుట కొరకు సీల్డ్ టెండర్, బహిరంగ వేలము నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల జూలై 16వ తేది పూర్తి చేసిన టెండర్లను స్వీకరిస్తామని, తదుపరి సీల్డ్ టెండర్, బహిరంగ వేలము పద్దతిలో ఈ నెల జూలై18వ తేది ఉదయం 11 గంటలకు నిర్వహిస్తామని, పూర్తి వివరాలకు నగరపాలక సంస్థ కార్యాలయంలో సంప్రదించవచ్చని కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

tirupati

SAKSHITHA NEWS