సిసి రోడ్లు వేయించినందుకు కార్పొరేటర్ గారిని సన్మానించిన గౌతమ్ నగర్ కాలనీవాసులు……

Spread the love

పటాన్చెరు లోని గౌతం నగర్ కాలనీలో GHMC నిధులు 42 లక్షలతో నూతన సిసి రోడ్లు వేయించినందుకు కార్పొరేటర్ గారిని సన్మానించిన గౌతమ్ నగర్ కాలనీవాసులు……

పటాన్చెరు డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్ కాలనీలో పాత రోడ్లు దెబ్బతిని కాలనీవాసులు రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉండేది అందులో వర్షాకాలం వస్తే మరింత ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. ఈ విషయమై కాలనీవాసులు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారిని నూతన సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరగా.. GHMC నిధులు రూపాయలు 42లక్షల వ్యయంతో నూతన సీసీ రోడ్డును వేయించడం జరిగింది.

కాగా తమ కాలనీలో నూతన సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేసినందుకు గౌతం నగర్ కాలనీవాసులు ఈ రోజు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారిని తమ కాలనీకి ఆహ్వానించి శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

  • కాలనీవాసులు మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని కాలనీల సమస్యల పరిష్కారం కోసం ప్రతి దినం కాలనీలలో పర్యటిస్తూ, కాలనీవాసులను కలిసి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తున్నారని, తమ కాలనీలో రోడ్డు సమస్య తెలియజేయగానే స్పందించి నూతన సిసి రోడ్డు వేయించినందుకు చాలా సంతోషంగా ఉందని కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడానికి తమను నమ్మకంతో ఎన్నుకోవడం జరిగిందని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల అవసరాల మేరకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. స్థానిక శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి సహాయ సహకారాలతో కాలనీలలో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయడం సాధ్యమవుతుందని కార్పొరేటర్ గారు తెలియజేయడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page