నిరుపేదలకు సీఎం సహాయనిధి సంజీవని : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

Spread the love

నిరుపేదలకు సీఎం సహాయనిధి సంజీవని : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి రాజీవ్ గాంధీనగర్ కు చెందిన ప్రసాద్ అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే కార్యాలయం చింతల్ లో సీఎంరిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా.. ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రభుత్వం ద్వారా రూ.2.50 లక్షలు మంజూరు చేయించి చెక్కును ప్రసాద్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు సంజీవని లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ ఫ్లోర్ లీడర్ ఆగం పాండు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page