పేదల పాలిట దేవుడు సీఎం కేసీఆర్…

Spread the love

CM KCR is the god of the poor

పేదల పాలిట దేవుడు సీఎం కేసీఆర్…

ఇచ్చిన మాటకు కట్టుబడి కొత్త పింఛన్లు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది…

చింతల్ డివిజన్ కు చెందిన 540 మందికి ఆసరా పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ కు చెందిన 540 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ భగత్ సింగ్ నగర్ లోని మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్ లో ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలను అన్ని విధాలుగా ఆదుకుంటూ సీఎం కేసీఆర్‌ వారి పాలిట దేవుడిగా నిలిచారని అన్నారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టి.లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు మక్సూద్, బస్వరాజు, శేఖర్ రావు, సాంబయ్య, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ మూర్తి, సామ్రాట్, ప్రభాకర్ గుప్త, వరద రాజు, అశోక్, అఖిల్, వర ప్రసాద్, అల్లాబకష్, రాజు, రమేష్, బీసు వెంకటేష్ గౌడ్, భూమయ్య, శ్రీశైలం యాదవ్, రాజు, రాము, వహీద్ ఖురేషి, మహిళా నాయకురాలు విజయ లక్ష్మి, మెహరున్నిస బేగం, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page