ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని గోదాకృష్ణ ఫంక్షన్ హాల్ లో జరిగిన క్రిస్టమస్ వేడుక

Spread the love

*ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని గోదాకృష్ణ ఫంక్షన్ హాల్ లో జరిగిన క్రిస్టమస్ వేడుకల సందర్భంగా జరిగిన సెమి క్రిస్టమస్ వేడుకలలో ఎమ్మెల్సీ రాజేశ్వరరావు , కార్పోరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ , మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు తో కలిసి క్రిస్టమస్ కేక్ కట్ చేసి, క్రిస్టియన్ సోదరి సోదరమణులకు ముందస్తు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియచేసిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ ఈ రోజు జరిగిన సెమి క్రిస్టమస్ వేడుకలలో పాల్గొనడం జరిగినది అని, చాలా సంతోషకరమైన రోజు అని ,ఆ దేవుడి కృప వలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండలని. క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించుకోవలని,ప్రతి ఒక్కరు సంతోషంగా పండుగను జరుపుకోవాలని .ఎంతో పవిత్రంగా భావించే క్రిస్మస్ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని, క్రిస్టమస్ కేక్ కట్ చేసి
క్రిస్మస్ సోదర సోదరిమనులకు ముందస్తు కిస్టమస్ శుభకాంక్షలు తెలియచేస్తునని ,అర్హులైన ప్రతి పేద వారికీ అనేక సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అనిల్ రెడ్డి, పాస్టర్లు మరియు క్రిస్టియన్ సోదరి సోదరమణులు తదితరులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page