వైఎస్సార్సీపీలో చేరిన చామర్తి టీడీపీ కార్యకర్తలు

Spread the love

వైఎస్సార్సీపీలో చేరిన చామర్తి టీడీపీ కార్యకర్తలు
కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

రాష్ట్రంలో సీఎం జగన్ గారి పాలన, పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చేస్తున్న మంచి పనులతో తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్సీపీలోకి వలసలు పెరిగాయి. అచ్చంపేట మండలం చామర్తి గ్రామానికి చెందిన పది కుటుంబాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీని వీడి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు.

గుంటూరులోని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు నివాసంలో ఆయన స్వయంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ పాలనలో ప్రజలు గత ప్రభుత్వానికి, తమ ప్రభుత్వానికి తేడా గమనిస్తున్నారన్నారు. కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. అందుకే టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందన్నారు. పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. అందరూ కలసికట్టుగా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో కోనంగి వీరయ్య, గౌతకట్ల అన్నమయ్య, గౌతకట్ల వెంకటేశ్వరరావు, గౌతకట్ల శీను, తెల్లమేకల అంకమ్మరావు, గౌతకట్ల నాగేశ్వరరావు, గౌతకట్ల ఏడుకొండలు, గౌతకట్ల హనుమంతరావు, గౌతకట్ల తిరుపతిరావు, గౌతకట్ల లక్ష్మయ్యలతో పాటు వారి కుటుంబసభ్యులు ఉన్నారు.

Whatsapp Image 2023 11 27 At 12.29.38 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page